'నామస్మరణ' అంటే భగవంతుని నామాన్ని నిరంతరం జపించడం లేదా తలచుకోవడం. ఇది హిందూ ధర్మంలో అత్యంత సులభమైన, శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనగా చెప్పబడుతోంది. కలియుగంలో మనిషికి సంపూర్ణ శాంతిని, ముక్తిని ప్రసాదించే మార్గంగా నామస్మరణను పెద్దలు ప్రబోధించారు. నామస్మరణ మనస్సును నిశ్చలపరుస్తుంది. మన ఆలోచనలు నిరంతరం బయటి విషయాలపై పరిగెత్తకుండా, కేంద్రీకరించడంలో ఇది సహాయపడుతుంది. నిరంతర నామజపం వల్ల ఒత్తిడి తగ్గి, మానసిక ఆందోళన దూరమవుతుంది. కష్ట సమయాల్లో భగవంతుని నామాన్ని తలచుకోవడం ద్వారా భయం తొలగి, ధైర్యం లభిస్తుంది. శరీర ఆరోగ్యంపై కూడా నామస్మరణ ప్రభావం చూపుతుంది. క్రమం తప్పకుండా జపం చేయడం వల్ల శ్వాస నియంత్రణలోకి వచ్చి, శరీరంలో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే, నిరంతర నామస్మరణ వలన మనిషి పాపాల నుండి విముక్తి పొంది, భగవంతుడికి చేరువ అవుతాడు. ఇది ఆత్మ పరిశుభ్రతకు, మోక్ష సాధనకు తొలి మెట్టుగా పరిగణించబడుతుంది. దేవుడి రూపాన్ని చూడకపోయినా, ఆయన నామాన్ని తలచుకోవడమే ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సరైన మార్గం.
కర్మ సిద్ధాంతం (సి.హెచ్.ప్రతాప్ ) “నహికశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతేహ్యవశః కర్మ సర్వప్రకృతిజైర్గుణైః ” — గీత 3అ.5శ్లో. భావం:సృష్టిలోని ప్రతిప్రాణీ ఒక్క క్షణం కూడా కర్మలను చేయకుండా ఉండలేదు. మనకు తెలియకుండానే కర్మలను చేస్తున్నాం. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. మనం చేసే కర్మలే మనకు ఉపయోగపడతాయి. ఎవరికైనా అన్యాయం చేస్తే మనకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎవరినైనా బాధ పెడితే ఆ బాధ వారికి కూడా కలుగుతుంది. వేద భూమి కావడంతో మనం అన్యాయాలను, అక్రమాలను సహించం. అవినీతి, బంధుప్రీతిని ఉపేక్షించం. మన కర్మలే మనకు జీవితంలో ఎదిగేందుకు సాయపడతాయి. కర్మ సిద్ధాంతం ఎంతో శక్తివంతమైనది.చేసిన కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు. నాటిన విత్తనల పంటే మనం తినాల్సి వస్తుంది. మోసం చేస్తే మోసగించబడక తప్పదు.అధర్మం గా సంపాదించిన ప్రతీ పైసాను తిరిగి కక్కవలసిందే !అందుకే ఈ క్షణం నుందే మన ఆలోచనా విధానం మారాలి .మోక్షం పొందడమే మన ఏకైక లక్ష్యం కావాలి. నిత్యం భగవన్నామస్మరణ, జపం, తపస్సు, ధ్యానం, యోగాభ్యాసం, మృదుభాషణం, సద్గంధ పఠనం, సత్సంగం లో పాల్గొనుట, సాత్విక ఆహార స్వీకరణ, కోరి...
Comments
Post a Comment