కర్మ సిద్ధాంతం (సి.హెచ్.ప్రతాప్ ) “నహికశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతేహ్యవశః కర్మ సర్వప్రకృతిజైర్గుణైః ” — గీత 3అ.5శ్లో. భావం:సృష్టిలోని ప్రతిప్రాణీ ఒక్క క్షణం కూడా కర్మలను చేయకుండా ఉండలేదు. మనకు తెలియకుండానే కర్మలను చేస్తున్నాం. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. మనం చేసే కర్మలే మనకు ఉపయోగపడతాయి. ఎవరికైనా అన్యాయం చేస్తే మనకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎవరినైనా బాధ పెడితే ఆ బాధ వారికి కూడా కలుగుతుంది. వేద భూమి కావడంతో మనం అన్యాయాలను, అక్రమాలను సహించం. అవినీతి, బంధుప్రీతిని ఉపేక్షించం. మన కర్మలే మనకు జీవితంలో ఎదిగేందుకు సాయపడతాయి. కర్మ సిద్ధాంతం ఎంతో శక్తివంతమైనది.చేసిన కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు. నాటిన విత్తనల పంటే మనం తినాల్సి వస్తుంది. మోసం చేస్తే మోసగించబడక తప్పదు.అధర్మం గా సంపాదించిన ప్రతీ పైసాను తిరిగి కక్కవలసిందే !అందుకే ఈ క్షణం నుందే మన ఆలోచనా విధానం మారాలి .మోక్షం పొందడమే మన ఏకైక లక్ష్యం కావాలి. నిత్యం భగవన్నామస్మరణ, జపం, తపస్సు, ధ్యానం, యోగాభ్యాసం, మృదుభాషణం, సద్గంధ పఠనం, సత్సంగం లో పాల్గొనుట, సాత్విక ఆహార స్వీకరణ, కోరి...
పూనా జిల్లా, జున్నూరు తాలూకా నారాయణ గ్రామము వాస్తవ్యుడు అయిన భీమాజీ పాటిల్ కు ఒకసారి ఉపిరితిత్తుల వ్యాధి సోకి, క్రమంగా అది క్షయగా పరిణమించింది. వైద్య విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజులలో క్షయవ్యాధిని మృత్యు ద్వారంగా పరిగణించేవారు. స్వతాహాగా ధనవంతుడైన భీమాజీ ఎన్నో రకాల మందులను వాడాడు, ఎందరో ప్రసిద్ధమైన దాక్టర్లకు చూపించాడు కాని ఆ వ్యాది ఇసుమంతైనా తగ్గలేదు. ఇక ప్రాణం మీద ఆశ వదులుకొని " ఓ భగవంతుడా నీవే నాకిక దిక్కు" అని రాత్రింబవళ్ళూ అతి దీనంగా ప్రార్ధించసాగాడు. అతని ప్రార్ధనలు ఆ సాయికి చేరాయా అన్నట్లుగా ఆ తర్వాత భీమాజి తన అనారోగ్యం వివరాలను సాయి భక్త శిఖామణి నానా చందోర్కర్ కు రాసాడు. అందుకు నానా " అన్ని వ్యాధులకు ఏకైక నివారణ సర్వస్య శరణాగతి చేసి సాయి పాదాలపై పడుటయే" అని సమాధానమిచ్చాడు. అప్పుడు భీమాజీ నానా సలహాపై అధారపడి తన బంధువుల సహాయంతో శిరిడీకి వచ్చి మసీదు లో బాబా కాళ్ళపై పడి తన వ్యాధి తగ్గించమని ప్రాధేయపడ్డాడు. ఈ వ్యాధి అతని గత జన్మల ప్రారబ్ధ ఫలితమని, ఆ పాపములను అనుభవించి వాటి నుండి విముక్తి అవ్వడమే సరైన మార్గమని, అందువలన ఈ విషయంలో తాను కలుగజేసుకొనడం లేదని బా...
విశాఖపట్నం నగరంలో ఉన్న ఒక ఆనందకరమైన అందమైన ఆలయం, శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం బలమైన చారిత్రక నేపథ్యం ప్రాముఖ్యతతో సమరూపతతో కూడిన నిర్మాణంతో ప్రగల్భాలు పలుకుతుంది. హిందూ సమాజానికి అంకితం చేయబడిన ఈ ఆలయం శ్రీ కనక మహాలక్ష్మి భక్తులకు దివ్యమైన, విశ్రాంతి మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది మరియు హిందూ సమాజానికి నిస్సందేహంగా సందర్శించదగిన ప్రదేశం. శ్రీ లక్ష్మి అవతారమైన ప్రతిష్ఠాపన విగ్రహం అప్పట్లో ఈ ప్రాంత పాలకుల కులదైవం అని, వారు ఆమెను అమ్మవారిగా ఆరాధించేవారు. పూర్వం ఓ పండితుడు కాశీకి చేరుకుని చివరివరకు అక్కడే గడిపి శివసాయుజ్యం పొందాలని బయలుదేరాడు మార్గమధ్యంలో ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ బావి వద్ద స్నానం ఆచరించాడు బావిలోపల నుంచి ఏదో శబ్దం వినిపించడంతో పండితుడు బావిలో నుంచి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని వెలుపలకు తీసి ప్రతిష్టించి పూజలు చేసినట్లు కథనం.విశాఖపట్నంలోని బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది ఆలయం చుట్టూ గోడ ఉంది కానీ పైకప్పు లేదు వానకు తడుస్తూ ఆరు బయట అమ్మ కొలువుతీరి ఉంది నడుము పైభాగం వరకు మాత్రమే అంటే చాతి వరకు మాత్రమే అమ్మవారి మూర్తి ఉంటు...
Comments
Post a Comment