సర్వే జనాః సుఖినో భవంతు
సర్వే జనాః సుఖినో భవంతు (సి.హెచ్. ప్రతాప్) మనిషి తన కోసం కోరుకునే సుఖం చిన్నది. తన కుటుంబం కోసం కోరుకునే సుఖం కొంచెం విశాలమైనది. తన సమాజం కోసం కోరుకునే సుఖం మరింత ఉన్నతమైనది. కానీ తనకు తెలియని ప్రతి జీవి సుఖంగా ఉండాలని కోరుకునే హృదయం—అదే భారతీయ ఆధ్యాత్మికత యొక్క మహోన్నత స్వరూపం. “సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః । సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్భవేత్ ॥” అందరూ సుఖంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ మంగళాన్ని చూడాలి. ఎవ్వరూ దుఃఖానికి గురికాకూడదు. ఈ ప్రార్థనలోని విశాలతను ఒక్కసారి మనసుతో అనుభవిస్తే భారతీయ ఋషుల హృదయం ఎంత అనంతమైనదో అర్థమవుతుంది. వారు తమ కోసం మాత్రమే జీవించలేదు. తమ కుటుంబం కోసం మాత్రమే ప్రార్థించలేదు. సమస్త జీవరాశి శాంతి, సుఖం, క్షేమం కోసం ప్రార్థించారు. వేదమంత్రాల్లో ప్రతిధ్వనించిన ఈ విశ్వమైత్రి భారతీయ ధర్మచింతనకు మూలస్తంభం. యజుర్వేదం మనకు— “మిత్రస్యాహం చక్షుషా సర్వాణి భూతాని సమీక్షే” అని చెబుతుంది. సమస్త జీవులను మిత్రుని దృష్టితో చూడు. శత్రువును వెతికే కళ్లకు ప్రపంచం విభజితంగా కనిపిస్తుంది; ప్రేమతో చూసే కళ్లకు ప్రపంచమంతా పరమాత్మ స్వరూపమే. ఋగ్వేదం...