Posts

కర్మ సిద్ధాంతం

  కర్మ సిద్ధాంతం (సి.హెచ్.ప్రతాప్ ) “నహికశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతేహ్యవశః కర్మ సర్వప్రకృతిజైర్గుణైః ” — గీత 3అ.5శ్లో. భావం:సృష్టిలోని ప్రతిప్రాణీ ఒక్క క్షణం కూడా కర్మలను చేయకుండా ఉండలేదు. మనకు తెలియకుండానే కర్మలను చేస్తున్నాం. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. మనం చేసే కర్మలే మనకు ఉపయోగపడతాయి. ఎవరికైనా అన్యాయం చేస్తే మనకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎవరినైనా బాధ పెడితే ఆ బాధ వారికి కూడా కలుగుతుంది. వేద భూమి కావడంతో మనం అన్యాయాలను, అక్రమాలను సహించం. అవినీతి, బంధుప్రీతిని ఉపేక్షించం. మన కర్మలే మనకు జీవితంలో ఎదిగేందుకు సాయపడతాయి. కర్మ సిద్ధాంతం ఎంతో శక్తివంతమైనది.చేసిన కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు. నాటిన విత్తనల పంటే మనం తినాల్సి వస్తుంది. మోసం చేస్తే మోసగించబడక తప్పదు.అధర్మం గా సంపాదించిన ప్రతీ పైసాను తిరిగి కక్కవలసిందే !అందుకే ఈ క్షణం నుందే మన ఆలోచనా విధానం మారాలి .మోక్షం పొందడమే మన ఏకైక లక్ష్యం కావాలి. నిత్యం భగవన్నామస్మరణ, జపం, తపస్సు, ధ్యానం, యోగాభ్యాసం, మృదుభాషణం, సద్గంధ పఠనం, సత్సంగం లో పాల్గొనుట, సాత్విక ఆహార స్వీకరణ, కోరి...

స్వధర్మాచరణయే శ్రేష్టం

Image
శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో (కర్మ యోగం, 35 వ శ్లోకం) ఈ విధం గా ప్రవచించారు: శ్రేయాన్ స్వధర్మ విగుణ : పరధర్మాత్స్వ నుష్టితాత్ స్వధర్మ నిధనం శ్రేయ: పరధర్మో భయావహ: “ ఓ అర్జునా ! ఎంతో నైపుణ్యం తో ఆచరించే పరధర్మం కన్నా , గుణరహితం గా చేసినప్పటికీ స్వధర్మమే మేలు. స్వధర్మ నిర్వహాణార్ధం సమసిపోయినా మంచిదే కాని, అమరణాంత భయావహమైన పరధర్మానుష్టానం మాత్రం తగదు."  ఈ ప్రపం చం లో మానవులకు వారి వారి కుల, మత,ప్రాంతీయ దేశ కాలమాన పరిస్థితుల ధృష్ట్యా విధించబడిన కర్మలను చేయుట, ధర్మమును ఆచరించుట వారికే కాక యావత్ సమాజానికే ఎంతో శ్రేయస్కరం. జన్మత: ప్రాప్తించిన కర్తవ్యాలను నిర్వహించడమే స్వధర్మాచరణ.పైపైన చూసినప్పుడు స్వధర్మంలో లోపాలు కనిపించవచ్చు. పరధర్మం ఉత్తమంగా కనిపించవచ్చు. తాను, తనవారనే మోహ సముద్రంలో మునిగిన అర్జునుడు ధర్మగ్లానిని పట్టించుకోకపోవడం పరధర్మాచరణమే. అలాంటి పరధర్మాచరణ కన్నా స్వధర్మాచరణలో మరణం ఎదురైనా దానిని స్వాగతించడమే ఉత్తమమని బోధిస్తున్నాడు కృష్ణుడు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధం లో ప్రతిపక్షం లో తాతలు,తండ్రులు, సోదర సమానులు,గురుతుల్యులు, వున్న కారణం గా  అర్జునుడు మాయామోహం లో పడి మన...

స్వ ధర్మాచరణ

గుణరహితమైనా ,కష్ట సాధ్యమైనా స్వధర్మాచరణయే అన్నింటి కంటే మేలైనది. పర ధర్మాచరణ మానవుని వినాశనానికి దారి తీస్తుంది. సమాజం లో అశాంతి, అలజడులు, అసమానతలు నెలకొనడం ఖాయం. జన్మత: ,వృత్తి వలన ప్రాప్తించిన స్వధర్మాన్ని విడవడం, పరధర్మాన్ని ఆచరించడం ఎంత మాత్రం తగదు. స్వధర్మం ఆచరించిన ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి మొదలైన వారు చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. మాకు ఒక మతం వలన మేలు కావడం లేదని ఇతర మతములను ఆశ్రయించేవారు ఈ విషయం లో సక్రమం గా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. జన్మత: సంక్రమించిన మతం పితృ సమానం. జన్మ నిచ్చిన తండ్రిని మార్చడం ఎంత పాపభూయిష్టమో మత మర్పిడి కూడా అంతే. దాని వలన బ్రహ్మ హత్యా పాతకం వంటి భయం కరమైన దోషాలు సంక్రమించడం తో పాటు రౌద్రవాది నరకముల ప్రాప్తి తప్పదు. అందుకే స్వధర్మాచరణే మిక్కిలి శ్రేష్టం. నారాయణ మంత్రం భయంకరమైన సంసార విషాన్ని హరిస్తుందని నారసింహ పురాణ వచనం. అనన్య భక్తితో భగవంతుని భజించడమే భక్తి యోగం. మన మనసును భగవంతునియందు మేళవింపజేయడమే ప్రార్థన. పవిత్రమైన మనసుతో చేసే ప్రార్థనను దేవుడు అవశ్యం వింటాడు అని మన వేదాలు ఘంటాపధంగా చెబుతున్నాయి. ఒక పండితుడు రామాయణ ఉపన్యాసం చ...

విశ్వజనీన ప్రేమతత్వం

Image
కృష్ణ భగవానుడిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అపారమైన ప్రేమ, భక్తి, సహనం వంటి విషయాలను గురించి భగవద్గీతలో కృష్ణుడు ప్రధానంగా వివరించాడు. ప్రేమతో జీవించడం అనేది జీవితంలో సత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, అనుభవాలను,శాంతిని ఆనందాన్ని నేర్పుతుందని ఆయన తెలిపారు.ప్రేమకు సహనం అనేది ముఖ్యం.నిజమైన ప్రేమ అనేది ఎటువంటి అంచనాలు లేకుండా, ఎటువంటి కారణాలు లేకుండా, ప్రయోజనం కోరకుండా ఉండాలని కృష్ణుడు తెలిపాడు.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలాంటి స్వార్థం, ఆశ లేకుండా ఉండటం, వారి మనోభావాలను గౌరవం ఇవ్వడం బంధాల్లో ప్రేమను పెంచేందుకు సహాయడతాయి. ఒకరి పట్ల మరొకరు జాగ్రత్తగా వ్యవహరించడమే నిజమైన ప్రేమ అని మన సనాతన ధర్మం చెబుతోంది.పరమాత్మను మీ సొంతం చేసుకోవాలంటే, కేవలం ప్రేమతోనే అది సాధ్యం. ప్రేమతో ఉంటే నేను సంతోషంగా మీ పరం అవుతాను. ప్రేమ అనేది జీవన శక్తి, ఇది ప్రపంచాన్ని నడిపించే శక్తి.నిజమైన హితుడు, స్నేహితుడు భగవంతుడు ఒక్కడే అనే సత్యాన్ని చెప్పే దే కుచేలుని చరిత్ర. ప్రకృతి పురుషుల కలయికను తెలిపే తత్త్వబోధనే రుక్మి ణీ కళ్యాణం. రుక్మిణి జీవాత్మ. శ్రీకృష్ణుడు పరమాత్మ. జీవాత్మ పరమాత్మ ను చేరాలనే తపనే రుక్మిణీ కళ్యాణం.మనిషి ...

కర్మ సిద్ధాంతం

“నహికశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతేహ్యవశః కర్మ సర్వప్రకృతిజైర్గుణైః ” — గీత 3అ.5శ్లో. భావం:సృష్టిలోని ప్రతిప్రాణీ ఒక్క క్షణం కూడా కర్మలను చేయకుండా ఉండలేదు. మనకు తెలియకుండానే కర్మలను చేస్తున్నాం. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. మనం చేసే కర్మలే మనకు ఉపయోగపడతాయి. ఎవరికైనా అన్యాయం చేస్తే మనకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎవరినైనా బాధ పెడితే ఆ బాధ వారికి కూడా కలుగుతుంది. వేద భూమి కావడంతో మనం అన్యాయాలను, అక్రమాలను సహించం. అవినీతి, బంధుప్రీతిని ఉపేక్షించం. మన కర్మలే మనకు జీవితంలో ఎదిగేందుకు సాయపడతాయి. కర్మ సిద్ధాంతం ఎంతో శక్తివంతమైనది.చేసిన కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు. నాటిన విత్తనల పంటే మనం తినాల్సి వస్తుంది. మోసం చేస్తే మోసగించబడక తప్పదు.అధర్మం గా సంపాదించిన ప్రతీ పైసాను తిరిగి కక్కవలసిందే !అందుకే ఈ క్షణం నుందే మన ఆలోచనా విధానం మారాలి .మోక్షం పొందడమే మన ఏకైక లక్ష్యం కావాలి. నిత్యం భగవన్నామస్మరణ, జపం, తపస్సు, ధ్యానం, యోగాభ్యాసం, మృదుభాషణం, సద్గంధ పఠనం, సత్సంగం లో పాల్గొనుట, సాత్విక ఆహార స్వీకరణ, కోరికల ఉధృతిని తగ్గించుకొనుట, అనిత్యమైన భోగ భ...

ధనుర్మాసం విశిష్టత

Image
శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా: సూర్యుడు నెలకు ఒక రాశి చొప్పున 12 నెలలు 12 రాశులలో సంచరిస్తాడు. ఆ విధంగా సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే సమయాన్ని ధనుర్మాసము అని పిలుస్తారు. ధనుర్మాసము దక్షిణాయణంలో చివరి మాసము. ఈ నెల 16న ప్రారంభమయ్యే ధనుర్మాసము జనవరి 13న ముగుస్తుంది. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది.భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది “ధనుర్మాసము”. ఈ మాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ, అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది.ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి.ధనుస్సంక్రమణ రోజు స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం అని మన శాస్త్రాలు తెలియజెస్తున్నాయి.ఈ ధనుర్మాసంల...

హృదయ శుద్ధి

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్దిలేని శివపూజలేలరా? విశ్వదాభిరామ! వినుర వేమ! మూఢనమ్మకాల చట్రంలో బ్రతుకుతూ అదే ఆధ్యాత్మికత అని భ్రమలో కొట్టుమిట్టాడే మానవులకు వేమన పరోక్షంగా ఈ పద్యం ద్వారా చురకలు అంటించాడు. కర్మలు చేయడం మానవుల ప్రధాన కర్తవ్యం అయితే ఆ కర్మలకు మంచి సానుకూల ఫలితాలు రావాలంటే పవిత్రమైన మనసు ఎంతో అవసరం అన్నది వేమన ప్రబోధం. మన మనసు నిర్మలంగా లేనపుడు ఎన్ని ఆచారాలు పాటించి మాత్రం ఏం ప్రయోజనం  ?  మనసంతా కోరికలు, అశాంతి, అసూయ, ఈర్ష్య వంటి వ్యతిరేక ఆలోచనలు నింపుకొని పైకి ఆడంబరమైన పూజలు, స్తోత్రాలు వంటి ఆచార వ్యవహార కాండ చేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఒనగూడదు. అన్నింటికీ నిర్మలమైన మనసే ప్రధానం. అందుకే మనస్సును పవిత్రం గా ఉంచుకోవడానికి పురుష ప్రయత్నం చేయాలి. అంతే నేటి కంప్యూటర్ భాషలో చెప్పాలంటే సాఫ్ట్ వేర్ ఎలాంటి వైరస్ లేకుండా వుండాలి. అప్పుడే కంప్యూటర్ ఎలాంటి సమస్యలు లేకుండా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీనికి ఉదాహరణగా శుచి, శుభ్రత లేని పాత్రలలో వంట చేస్తే అది పాడైపోయి తినేవారికి అనారోగ్యం కలిగిస్తుంది. వంట చేసేటప్పుడు మానసిక పవిత్రతతో పాటు శారీరక పవిత్...