Posts

నామస్మరణ విశిష్టత

'నామస్మరణ' అంటే భగవంతుని నామాన్ని నిరంతరం జపించడం లేదా తలచుకోవడం. ఇది హిందూ ధర్మంలో అత్యంత సులభమైన, శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనగా చెప్పబడుతోంది. కలియుగంలో మనిషికి సంపూర్ణ శాంతిని, ముక్తిని ప్రసాదించే మార్గంగా నామస్మరణను పెద్దలు ప్రబోధించారు. నామస్మరణ మనస్సును నిశ్చలపరుస్తుంది. మన ఆలోచనలు నిరంతరం బయటి విషయాలపై పరిగెత్తకుండా, కేంద్రీకరించడంలో ఇది సహాయపడుతుంది. నిరంతర నామజపం వల్ల ఒత్తిడి తగ్గి, మానసిక ఆందోళన దూరమవుతుంది. కష్ట సమయాల్లో భగవంతుని నామాన్ని తలచుకోవడం ద్వారా భయం తొలగి, ధైర్యం లభిస్తుంది. శరీర ఆరోగ్యంపై కూడా నామస్మరణ ప్రభావం చూపుతుంది. క్రమం తప్పకుండా జపం చేయడం వల్ల శ్వాస నియంత్రణలోకి వచ్చి, శరీరంలో సానుకూల శక్తి  ప్రసరిస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే, నిరంతర నామస్మరణ వలన మనిషి పాపాల నుండి విముక్తి పొంది, భగవంతుడికి చేరువ అవుతాడు. ఇది ఆత్మ పరిశుభ్రతకు, మోక్ష సాధనకు తొలి మెట్టుగా పరిగణించబడుతుంది. దేవుడి రూపాన్ని చూడకపోయినా, ఆయన నామాన్ని తలచుకోవడమే ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సరైన మార్గం.

భగవంతుని నిత్య చింతన

భగవంతుని నిత్య చింతన

ధ్యానం ప్రాశస్థ్యం

 ఆధునిక జీవితంలో ధ్యానం అనేది కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికీ అవసరమైన మానసిక ఆరోగ్యం సాధనం. ధ్యానం మనస్సును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని మరియు ఆందోళనను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ రోజుల్లో పెరుగుతున్న పని ఒత్తిడి, వేగవంతమైన జీవన శైలి కారణంగా మెదడు అలసిపోతుంది; ధ్యానం చేయడం వల్ల మనస్సులోని ఆలోచనల ప్రవాహం నెమ్మదిస్తుంది, దీనివల్ల అంతర్గత ప్రశాంతత లభిస్తుంది. రోజుకు కేవలం 10 నుంచి 20 నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఇది విద్యార్థులకు, ఉద్యోగులకు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. శారీరక ఆరోగ్యం పరంగా చూస్తే, ధ్యానం రక్తపోటును అదుపులో ఉంచి, నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ఈ ప్రక్రియలో శ్వాసపై దృష్టి పెట్టడం వలన వర్తమానంలో జీవించడం అలవడుతుంది. దీని ఫలితంగా భావోద్వేగ నియంత్రణ మెరుగుపడి, జీవితంలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి ధ్యానాన్ని దినచర్యలో భాగం చేసుకోవడం అత్యంత ముఖ్యం. 

నవదుర్గల విశిష్టత: శక్తికి ప్రతీకలు

భారతీయ సనాతన ధర్మంలో, ముఖ్యంగా శరన్నవరాత్రుల సమయంలో, నవదుర్గల ఆరాధన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దుర్గాదేవి తొమ్మిది రూపాలైన ఈ నవదుర్గలు కేవలం దేవతా మూర్తులు మాత్రమే కాదు, అవి విశ్వంలో నిండి ఉన్న అనంతమైన శక్తికి, ధైర్యానికి, మరియు జ్ఞానానికి ప్రతీకలు. ప్రతి రూపం మానవ జీవితంలో ఉండే ఒక్కో లక్షణాన్ని, ఒక్కో శక్తిని సూచిస్తుంది. శక్తికి ప్రతీకగా నవ రూపాలు ప్రతి నవరాత్రి రోజున పూజించే ఒక్కో దుర్గా రూపం తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. శైలపుత్రి: పర్వతరాజు హిమవంతుని కుమార్తె. ధైర్యాన్ని, స్థిరత్వాన్ని సూచిస్తుంది. నవరాత్రులలో మొదటి రోజు ఈమెను ఆరాధిస్తారు. బ్రహ్మచారిణి: తపస్సుకు, వైరాగ్యానికి చిహ్నం. ఆధ్యాత్మిక జ్ఞానం, నిగ్రహాన్ని ప్రసాదిస్తుంది. చంద్రఘంట: శిరస్సుపై చంద్రవంక ధరించి, శాంతికి, సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. భయాన్ని తొలగిస్తుంది. కూష్మాండ: బ్రహ్మాండాన్ని సృష్టించినదిగా భావిస్తారు. ఆరోగ్యానికీ, శక్తికీ మూలం ఈ దేవి. స్కందమాత: కుమారస్వామి (స్కందుడు) తల్లి. మాతృ ప్రేమను, దయను సూచిస్తుంది. కాత్యాయని: దుష్టశక్తులను సంహరించేందుకు అవతరించిన ఉగ్రరూపం. ధర్మాన్ని రక్షిస్తుంది. కాళర...

కామాఖ్యా దేవి

Image
భారతదేశంలోని  51  శక్తిపీఠాల్లో  అత్యంత ప్రాచీనమైనది, పవిత్రమైనది అస్సాంలోని  నీలాచల్  పర్వతంపై వెలసిన కామాఖ్యా దేవి ఆలయం. ఇక్కడ వెలసిన  దేవిని  కామాఖ్యా దేవి, కామరూపిణి అని పిలుస్తారు. "కామం" అనగా సాధారణంగా శారీరక ఆకర్షణ లేదా చిత్తచాంచల్యం అని అర్థం. కానీ ఇక్కడ "కామ" అనగా సంకల్పం, మార్పు  శక్తిగా  భావించబడుతుంది. అనుకున్న రూపాన్ని, అనుకున్న క్షణంలో మార్చుకోగల శక్తి కలిగినవారే  కామరూపిణులు .  అలాంటి   శక్తిమంతురాలు  కావడంతోనే ఆమెను కామరూపిణీ అంటారు. కామాఖ్యా దేవి అనేక రూపాల్లో భక్తులకు ప్రత్యక్షమై, వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. ఆమెను త్రిపుర శక్తిదాయినిగా కొలుస్తారు, ఎందుకంటే ఈ క్షేత్రంలో ఆమె మూడు ప్రధాన రూపాల్లో దర్శనమిస్తుంది. తంత్ర, శక్తి, భక్తి పరంగా ఇది అత్యంత శక్తివంతమైన పీఠంగా భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. ఆలయంలో విగ్రహం లేకుండా, యోనిపీఠాన్ని మాత్రమే పూజిస్తారు. ఇది శక్తిస్వరూపాన్ని సూచిస్తుంది. ఈ క్షేత్రంలో జరిగే అంబుబాచీ మేళాకు విశేష ప్రాధాన్యం ఉంది. మానవ స్త్రీల మాదిరిగానే కామా...

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం

శ్రీ గురు గీత లోని శ్లోకాలు: గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే  నమః అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే  నమః సందర్భం లో బాబా నానాతో " నీ ఇంటి గడపలోకి ఎవరైనా వచ్చి సహాయమడిగితే  నీ శక్తి సామర్ధ్యాల మేరకు వారికి దానమిచ్చి పంపు. ఏమీ లేకపోతే కనీసం రెండు మంచి మాటలైనా చెప్పు” అని సలహా ఇచ్చారు.అలాగేనని నానా  తలూపి వెళ్ళిపోయాడు .నాలుగయిదు రోజుల తర్వాత అతని ఇంటికి ఒక ముసలావిడ వచ్చి కాస్త అన్నం వుంటే పెట్టమని అడిగింది.ఇంట్లో పెట్టేందుకు ఏమీ లేదని నానా పనిమనిషి ఆ ముసలిదానిని పంపించబోయింది కాని ఆ ముదుసలి ఏమైన పెడితే కని వెళ్ళనని భీష్మించుకు కూర్చుంది. ఇంతలో ఇంట్లోంచి నానా వచ్చి ఎవడబ్బ సొమ్మని నా ఇంట్లోకి వచ్చి బిచ్చమడుగుతున్నావని పెద్దగా తిట్టి ఆమెను మెడ బట్టి గెంటేసాడు. నానా కొంతకాలానికి శిరిడీ వెళ్ళి సాయిని దర్శించుకున్నప్పుడు “ నీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను మెడ బట్టి బయటకు గెంటేసావెందుకు?” అని అడిగారు. బాబా మటలకు  నానా ఆశ్చర్యపోయాడు. తను తన సమర్ధ సద్గురువైన బాబను బయటకు పంపించడమేమ...

ఉత్తమ సాధకులు

  సంచిక అంతర్జాల పత్రికలో ప్రచురింపబడిన నా ఈ రచనను ఈ దిగువ ఇవ్వంబడిన లింక్ ద్వారా చదివి తమ అమూల్యమైన అభిప్రాయం తెలుపగలరు.  https://sanchika.com/uttama-saadhakulu-chp/