Posts

కామాఖ్యా దేవి

Image
భారతదేశంలోని  51  శక్తిపీఠాల్లో  అత్యంత ప్రాచీనమైనది, పవిత్రమైనది అస్సాంలోని  నీలాచల్  పర్వతంపై వెలసిన కామాఖ్యా దేవి ఆలయం. ఇక్కడ వెలసిన  దేవిని  కామాఖ్యా దేవి, కామరూపిణి అని పిలుస్తారు. "కామం" అనగా సాధారణంగా శారీరక ఆకర్షణ లేదా చిత్తచాంచల్యం అని అర్థం. కానీ ఇక్కడ "కామ" అనగా సంకల్పం, మార్పు  శక్తిగా  భావించబడుతుంది. అనుకున్న రూపాన్ని, అనుకున్న క్షణంలో మార్చుకోగల శక్తి కలిగినవారే  కామరూపిణులు .  అలాంటి   శక్తిమంతురాలు  కావడంతోనే ఆమెను కామరూపిణీ అంటారు. కామాఖ్యా దేవి అనేక రూపాల్లో భక్తులకు ప్రత్యక్షమై, వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. ఆమెను త్రిపుర శక్తిదాయినిగా కొలుస్తారు, ఎందుకంటే ఈ క్షేత్రంలో ఆమె మూడు ప్రధాన రూపాల్లో దర్శనమిస్తుంది. తంత్ర, శక్తి, భక్తి పరంగా ఇది అత్యంత శక్తివంతమైన పీఠంగా భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. ఆలయంలో విగ్రహం లేకుండా, యోనిపీఠాన్ని మాత్రమే పూజిస్తారు. ఇది శక్తిస్వరూపాన్ని సూచిస్తుంది. ఈ క్షేత్రంలో జరిగే అంబుబాచీ మేళాకు విశేష ప్రాధాన్యం ఉంది. మానవ స్త్రీల మాదిరిగానే కామా...

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం

శ్రీ గురు గీత లోని శ్లోకాలు: గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే  నమః అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే  నమః సందర్భం లో బాబా నానాతో " నీ ఇంటి గడపలోకి ఎవరైనా వచ్చి సహాయమడిగితే  నీ శక్తి సామర్ధ్యాల మేరకు వారికి దానమిచ్చి పంపు. ఏమీ లేకపోతే కనీసం రెండు మంచి మాటలైనా చెప్పు” అని సలహా ఇచ్చారు.అలాగేనని నానా  తలూపి వెళ్ళిపోయాడు .నాలుగయిదు రోజుల తర్వాత అతని ఇంటికి ఒక ముసలావిడ వచ్చి కాస్త అన్నం వుంటే పెట్టమని అడిగింది.ఇంట్లో పెట్టేందుకు ఏమీ లేదని నానా పనిమనిషి ఆ ముసలిదానిని పంపించబోయింది కాని ఆ ముదుసలి ఏమైన పెడితే కని వెళ్ళనని భీష్మించుకు కూర్చుంది. ఇంతలో ఇంట్లోంచి నానా వచ్చి ఎవడబ్బ సొమ్మని నా ఇంట్లోకి వచ్చి బిచ్చమడుగుతున్నావని పెద్దగా తిట్టి ఆమెను మెడ బట్టి గెంటేసాడు. నానా కొంతకాలానికి శిరిడీ వెళ్ళి సాయిని దర్శించుకున్నప్పుడు “ నీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను మెడ బట్టి బయటకు గెంటేసావెందుకు?” అని అడిగారు. బాబా మటలకు  నానా ఆశ్చర్యపోయాడు. తను తన సమర్ధ సద్గురువైన బాబను బయటకు పంపించడమేమ...

ఉత్తమ సాధకులు

  సంచిక అంతర్జాల పత్రికలో ప్రచురింపబడిన నా ఈ రచనను ఈ దిగువ ఇవ్వంబడిన లింక్ ద్వారా చదివి తమ అమూల్యమైన అభిప్రాయం తెలుపగలరు.  https://sanchika.com/uttama-saadhakulu-chp/

రుద్రాక్షల ప్రాశస్థ్యం

Image
  రుద్రాక్షల ప్రాశస్థ్యం రుద్రాక్ష అంటే రుద్ర+అక్ష = రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని (శివుడు) అక్షుల (కన్నుల) నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. శివ పురాణము ప్రకారము రుద్రాక్ష పరమశివునికి ప్రీతికరమైనది. అందువల్ల హిందువులు మరీ ముఖ్యముగా శైవ సాంప్రదాయాన్ని పాటించేవారికి రుద్రాక్ష పరమ పవిత్రమైనది. రుద్రాక్ష ధారణ వల్ల పాపాలు తొలగి, ధరించినవారు శివునికి ప్రీతి పాత్రులవుతారని హిందువుల నమ్మకము. రుద్రాక్షను ధరించి భక్తితో ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రము జపిస్తే సకల శుభాలు కలుగుతాయని శివపురాణములో పేర్కొనబడింది. రుద్రాక్షను ధరించినవారు మద్యమాంసములను ముట్టకూడదు, మరే యితర అనైతిక కార్యక్రమాలలో పాల్గొనకూడదు.రుద్రాక్షలు వైద్య పరముగా కూడా ముఖ్యమైనవి ఆయుర్వేద వైద్యములో వీటిని ఉపయోగిస్తారు. ముఖ్యముగా అధిక రక్త పీడనాన్ని రుద్రాక్ష అదుపు చేస్తుందని చాలా మంది నమ్మకము. సహజంగా ఈ రుద్రాక్షలన్నింటినీ కూర్చి ఒక దండలాగా చేస్తారు సాంప్రదాయకంగా ఒక రుద్రాక్ష మాలలో 108 పూస...

కర్మ సిద్ధాంతం

  కర్మ సిద్ధాంతం (సి.హెచ్.ప్రతాప్ ) “నహికశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతేహ్యవశః కర్మ సర్వప్రకృతిజైర్గుణైః ” — గీత 3అ.5శ్లో. భావం:సృష్టిలోని ప్రతిప్రాణీ ఒక్క క్షణం కూడా కర్మలను చేయకుండా ఉండలేదు. మనకు తెలియకుండానే కర్మలను చేస్తున్నాం. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. మనం చేసే కర్మలే మనకు ఉపయోగపడతాయి. ఎవరికైనా అన్యాయం చేస్తే మనకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎవరినైనా బాధ పెడితే ఆ బాధ వారికి కూడా కలుగుతుంది. వేద భూమి కావడంతో మనం అన్యాయాలను, అక్రమాలను సహించం. అవినీతి, బంధుప్రీతిని ఉపేక్షించం. మన కర్మలే మనకు జీవితంలో ఎదిగేందుకు సాయపడతాయి. కర్మ సిద్ధాంతం ఎంతో శక్తివంతమైనది.చేసిన కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు. నాటిన విత్తనల పంటే మనం తినాల్సి వస్తుంది. మోసం చేస్తే మోసగించబడక తప్పదు.అధర్మం గా సంపాదించిన ప్రతీ పైసాను తిరిగి కక్కవలసిందే !అందుకే ఈ క్షణం నుందే మన ఆలోచనా విధానం మారాలి .మోక్షం పొందడమే మన ఏకైక లక్ష్యం కావాలి. నిత్యం భగవన్నామస్మరణ, జపం, తపస్సు, ధ్యానం, యోగాభ్యాసం, మృదుభాషణం, సద్గంధ పఠనం, సత్సంగం లో పాల్గొనుట, సాత్విక ఆహార స్వీకరణ, కోరి...

స్వధర్మాచరణయే శ్రేష్టం

Image
శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో (కర్మ యోగం, 35 వ శ్లోకం) ఈ విధం గా ప్రవచించారు: శ్రేయాన్ స్వధర్మ విగుణ : పరధర్మాత్స్వ నుష్టితాత్ స్వధర్మ నిధనం శ్రేయ: పరధర్మో భయావహ: “ ఓ అర్జునా ! ఎంతో నైపుణ్యం తో ఆచరించే పరధర్మం కన్నా , గుణరహితం గా చేసినప్పటికీ స్వధర్మమే మేలు. స్వధర్మ నిర్వహాణార్ధం సమసిపోయినా మంచిదే కాని, అమరణాంత భయావహమైన పరధర్మానుష్టానం మాత్రం తగదు."  ఈ ప్రపం చం లో మానవులకు వారి వారి కుల, మత,ప్రాంతీయ దేశ కాలమాన పరిస్థితుల ధృష్ట్యా విధించబడిన కర్మలను చేయుట, ధర్మమును ఆచరించుట వారికే కాక యావత్ సమాజానికే ఎంతో శ్రేయస్కరం. జన్మత: ప్రాప్తించిన కర్తవ్యాలను నిర్వహించడమే స్వధర్మాచరణ.పైపైన చూసినప్పుడు స్వధర్మంలో లోపాలు కనిపించవచ్చు. పరధర్మం ఉత్తమంగా కనిపించవచ్చు. తాను, తనవారనే మోహ సముద్రంలో మునిగిన అర్జునుడు ధర్మగ్లానిని పట్టించుకోకపోవడం పరధర్మాచరణమే. అలాంటి పరధర్మాచరణ కన్నా స్వధర్మాచరణలో మరణం ఎదురైనా దానిని స్వాగతించడమే ఉత్తమమని బోధిస్తున్నాడు కృష్ణుడు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధం లో ప్రతిపక్షం లో తాతలు,తండ్రులు, సోదర సమానులు,గురుతుల్యులు, వున్న కారణం గా  అర్జునుడు మాయామోహం లో పడి మన...

స్వ ధర్మాచరణ

గుణరహితమైనా ,కష్ట సాధ్యమైనా స్వధర్మాచరణయే అన్నింటి కంటే మేలైనది. పర ధర్మాచరణ మానవుని వినాశనానికి దారి తీస్తుంది. సమాజం లో అశాంతి, అలజడులు, అసమానతలు నెలకొనడం ఖాయం. జన్మత: ,వృత్తి వలన ప్రాప్తించిన స్వధర్మాన్ని విడవడం, పరధర్మాన్ని ఆచరించడం ఎంత మాత్రం తగదు. స్వధర్మం ఆచరించిన ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి మొదలైన వారు చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. మాకు ఒక మతం వలన మేలు కావడం లేదని ఇతర మతములను ఆశ్రయించేవారు ఈ విషయం లో సక్రమం గా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. జన్మత: సంక్రమించిన మతం పితృ సమానం. జన్మ నిచ్చిన తండ్రిని మార్చడం ఎంత పాపభూయిష్టమో మత మర్పిడి కూడా అంతే. దాని వలన బ్రహ్మ హత్యా పాతకం వంటి భయం కరమైన దోషాలు సంక్రమించడం తో పాటు రౌద్రవాది నరకముల ప్రాప్తి తప్పదు. అందుకే స్వధర్మాచరణే మిక్కిలి శ్రేష్టం. నారాయణ మంత్రం భయంకరమైన సంసార విషాన్ని హరిస్తుందని నారసింహ పురాణ వచనం. అనన్య భక్తితో భగవంతుని భజించడమే భక్తి యోగం. మన మనసును భగవంతునియందు మేళవింపజేయడమే ప్రార్థన. పవిత్రమైన మనసుతో చేసే ప్రార్థనను దేవుడు అవశ్యం వింటాడు అని మన వేదాలు ఘంటాపధంగా చెబుతున్నాయి. ఒక పండితుడు రామాయణ ఉపన్యాసం చ...